Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన
03-06-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కలిపి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ నాయకత్వం వహించారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, అవసరమైన మందులు, గడ్డపారు, గంపలు వంటి పనిముట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కనీస వేతనం సరిపోవడం లేదని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో రోజువారీ వేతనాన్ని రూ.350 నుంచి రూ.600లకు పెంచాలని కోరారు.


ఈ సందర్భంగా కూలీల సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓ. నరసప్ప, ప్రమీలమ్మ, గంగమ్మ, సిద్ధప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


Sthanikam

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కలిపి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ నాయకత్వం వహించారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, అవసరమైన మందులు, గడ్డపారు, గంపలు వంటి పనిముట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కనీస వేతనం సరిపోవడం లేదని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో రోజువారీ వేతనాన్ని రూ.350 నుంచి రూ.600లకు పెంచాలని కోరారు.


ఈ సందర్భంగా కూలీల సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓ. నరసప్ప, ప్రమీలమ్మ, గంగమ్మ, సిద్ధప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News