Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:53 AM

సంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా ఆర్. రోహిణి బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా ఆర్. రోహిణి బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి జిల్లా నూతన డీఈఓగా ఆర్. రోహిణి బాధ్యతల స్వీకరణ
June 03, 2026 02:50 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈఓ) ఆర్. రోహిణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై సంగారెడ్డి జిల్లాకు వచ్చి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు డీఈఓగా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు బదిలీపై రంగారెడ్డి జిల్లాకు వెళ్లగా, ఆయన స్థానంలో ఆర్. రోహిణి నియమితులయ్యారు. విద్యా రంగంలో తనకున్న అనుభవంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా విద్యార్థులకు చేరవేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆమె రాకతో జిల్లాలో విద్యా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు, ఉపాధ్యాయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News