Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!
24-05-2026 257 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధికారుల అనుమతి లేకుండా టెంట్లు, మైకులు ఎలా పెడతారు...?

మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు

సభలకు వచ్చే వారి వివరాలు సేకరించి, రిజర్వేషన్లు రద్దు చేయాలి: హిందూ సంఘాల నేతల డిమాండ్

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్ స్టేషన్ ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సువార్త మహాసభలు నిర్వహించడం మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధానమేనని పలువురు హిందూ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చర్చి స్థలాలు, స్కూల్ గ్రౌండ్లు ఉన్నప్పటికీ కావాలనే కొందరు బడా నాయకుల ప్రోద్బలంతో ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఈ సభలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక రామాలయానికి సరైన స్థలం లేనందున గతంలో సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడే నిర్వహించామని, ఇప్పుడు కావాలనే అదే స్థలంలో సువార్త సభల కోసం టెంట్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.​

ట్రాఫిక్ ఇబ్బందులు పట్టవా..?

పట్టణంలో ఇప్పటికే రోడ్డు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ఇక్కడ మహాసభలు నిర్వహిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ రికార్డులలో లేని క్రైస్తవులు ఈ సభలకు ఎక్కడి నుండి వస్తున్నారో అధికారులు గమనించాలని కోరారు. బయటి ప్రాంతాల నుండి వచ్చే వారి వివరాలు సేకరించి, వారు అక్రమంగా ఏవైనా రిజర్వేషన్ ఫలాలు పొందుతుంటే వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేవన్న ఆర్టీసీ అధికారులు:

ఈ విషయమై తాము నార్కట్‌పల్లి ఆర్టీసీ డీఎం, నల్గొండ ఆర్‌ఎమ్‌లను ఫోన్ ద్వారా సంప్రదించగా... తాము సభలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారని నేతలు తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఇక్కడ సభలు ఎలా నిర్వహిస్తారని, ఇదే విధంగా అన్ని మతాల వారు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఈ స్థలాన్ని వాడుకోవచ్చా? అని నిలదీశారు. పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు స్పందించి, ఇక్కడ జరుగుతున్న సభలపై పునరాలోచించాలని కోరారు.ఈ కార్యక్రమంలో

దూడల భిక్షం గౌడ్, దిండు భాస్కర్, కడారి ఐలయ్య, వంగాల రమాకాంత్, సప్పిడి లింగారెడ్డి, బక్కనగారి రోహిత్, పల్చం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ స్థలంలో సువార్త మహాసభలా? అనుమతులు లేవు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే!

Article Image

అధికారుల అనుమతి లేకుండా టెంట్లు, మైకులు ఎలా పెడతారు...?

మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు

సభలకు వచ్చే వారి వివరాలు సేకరించి, రిజర్వేషన్లు రద్దు చేయాలి: హిందూ సంఘాల నేతల డిమాండ్

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్ స్టేషన్ ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సువార్త మహాసభలు నిర్వహించడం మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధానమేనని పలువురు హిందూ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చర్చి స్థలాలు, స్కూల్ గ్రౌండ్లు ఉన్నప్పటికీ కావాలనే కొందరు బడా నాయకుల ప్రోద్బలంతో ఆర్టీసీ ఖాళీ స్థలంలో ఈ సభలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక రామాలయానికి సరైన స్థలం లేనందున గతంలో సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడే నిర్వహించామని, ఇప్పుడు కావాలనే అదే స్థలంలో సువార్త సభల కోసం టెంట్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.​

ట్రాఫిక్ ఇబ్బందులు పట్టవా..?

పట్టణంలో ఇప్పటికే రోడ్డు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ఇక్కడ మహాసభలు నిర్వహిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ రికార్డులలో లేని క్రైస్తవులు ఈ సభలకు ఎక్కడి నుండి వస్తున్నారో అధికారులు గమనించాలని కోరారు. బయటి ప్రాంతాల నుండి వచ్చే వారి వివరాలు సేకరించి, వారు అక్రమంగా ఏవైనా రిజర్వేషన్ ఫలాలు పొందుతుంటే వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేవన్న ఆర్టీసీ అధికారులు:

ఈ విషయమై తాము నార్కట్‌పల్లి ఆర్టీసీ డీఎం, నల్గొండ ఆర్‌ఎమ్‌లను ఫోన్ ద్వారా సంప్రదించగా... తాము సభలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారని నేతలు తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఇక్కడ సభలు ఎలా నిర్వహిస్తారని, ఇదే విధంగా అన్ని మతాల వారు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఈ స్థలాన్ని వాడుకోవచ్చా? అని నిలదీశారు. పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు స్పందించి, ఇక్కడ జరుగుతున్న సభలపై పునరాలోచించాలని కోరారు.ఈ కార్యక్రమంలో

దూడల భిక్షం గౌడ్, దిండు భాస్కర్, కడారి ఐలయ్య, వంగాల రమాకాంత్, సప్పిడి లింగారెడ్డి, బక్కనగారి రోహిత్, పల్చం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News