వారం రోజులుగా నీటి సరఫరా బంద్. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు
వారం రోజులుగా నీటి సరఫరా బంద్. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు
Editor Desk
ఎల్బీనగర్: నాగోల్ ఎక్స్రోడ్డు సమీపంలోని కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్–2లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఐదు రోజులుగా నీటి సరఫరా పునరుద్ధరించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. తాగునీటితో పాటు రోజువారీ అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
అత్యవసర అవసరాల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్ను బుక్ చేసినప్పటికీ 45 గంటలు గడిచినా ఇప్పటివరకు రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి