Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌.  కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు
03-06-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్: నాగోల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్–2లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఐదు రోజులుగా నీటి సరఫరా పునరుద్ధరించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. తాగునీటితో పాటు రోజువారీ అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

అత్యవసర అవసరాల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసినప్పటికీ 45 గంటలు గడిచినా ఇప్పటివరకు రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Sthanikam

వారం రోజులుగా నీటి సరఫరా బంద్‌. కోపరేటివ్ బ్యాంక్ రోడ్ నెం.2 వాసుల అవస్థలు

Article Image

ఎల్బీనగర్: నాగోల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్–2లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ ఐదు రోజులుగా నీటి సరఫరా పునరుద్ధరించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. తాగునీటితో పాటు రోజువారీ అవసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

అత్యవసర అవసరాల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసినప్పటికీ 45 గంటలు గడిచినా ఇప్పటివరకు రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News