Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:56 PM

రైతు చెమట చుక్క వృథా కాకూడదు – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

రైతు చెమట చుక్క వృథా కాకూడదు – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

రైతు చెమట చుక్క వృథా కాకూడదు – ఎమ్మెల్యే చింత ప్రభాకర్
May 22, 2026 08:04 PM 246 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దారుణమన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌తో సమావేశమై వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ, సదాశివపేట పరిధిలో 4 వేల 693 ఎకరాల్లో జొన్న పంట సాగు జరిగిందని, ఒక ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని తెలిపారు. అయితే ప్రభుత్వం పరిమిత క్వింటాళ్లనే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కనీసం ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ పరిమితుల కారణంగా రైతులు బయట మార్కెట్‌లో తక్కువ ధరలకు జొన్నలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. “పండించేది రైతు… లాభపడేది దళారులా?” అంటూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే తార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతు చెమట చుక్క వృథా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేపడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News