Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:55 AM

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి
June 03, 2026 06:30 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకదానికొకటి వెనుక నుంచి మూడు డీసీఎం వాహనాలు బలంగా ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి చెందగా, 300కు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబం మాత్రమే కాకుండా యాదవ, కురుమ వర్గాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి ఎగ్గెంశెట్టి ఎల్లయ్య తన కుటుంబ సభ్యులు, ఇతర కాపరులతో కలిసి ఆంధ్ర ప్రాంతంలో గొర్రెలను మేపుకొని మూడు డీసీఎం వాహనాల్లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి సమీపంలో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల్లో తరలిస్తున్న 300కు పైగా గొర్రెలు మృతి చెందడంతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెల మృతదేహాలు స్థానికులను కలచివేశాయి.సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య, గొర్రెల పెంపకదారుల కార్పొరేషన్ చైర్మన్ సరిత, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ బాధిత కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి గరిష్ట స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గొర్రెలను కోల్పోయి తీవ్ర నష్టపోయిన యాదవ, కురుమ కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రమాదంలో ఓ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, వందలాది గొర్రెలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News