Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి
03-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకదానికొకటి వెనుక నుంచి మూడు డీసీఎం వాహనాలు బలంగా ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి చెందగా, 300కు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబం మాత్రమే కాకుండా యాదవ, కురుమ వర్గాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి ఎగ్గెంశెట్టి ఎల్లయ్య తన కుటుంబ సభ్యులు, ఇతర కాపరులతో కలిసి ఆంధ్ర ప్రాంతంలో గొర్రెలను మేపుకొని మూడు డీసీఎం వాహనాల్లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి సమీపంలో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల్లో తరలిస్తున్న 300కు పైగా గొర్రెలు మృతి చెందడంతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెల మృతదేహాలు స్థానికులను కలచివేశాయి.సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య, గొర్రెల పెంపకదారుల కార్పొరేషన్ చైర్మన్ సరిత, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ బాధిత కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి గరిష్ట స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గొర్రెలను కోల్పోయి తీవ్ర నష్టపోయిన యాదవ, కురుమ కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రమాదంలో ఓ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, వందలాది గొర్రెలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Sthanikam

మూడు డీసీఎంలు ఢీకొని బీభత్సం.. కాపరి మృతి, 300కు పైగా గొర్రెలు మృతి

Article Image

నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకదానికొకటి వెనుక నుంచి మూడు డీసీఎం వాహనాలు బలంగా ఢీకొనడంతో గొర్రెల కాపరి మృతి చెందగా, 300కు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ దుర్ఘటనతో బాధిత కుటుంబం మాత్రమే కాకుండా యాదవ, కురుమ వర్గాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి ఎగ్గెంశెట్టి ఎల్లయ్య తన కుటుంబ సభ్యులు, ఇతర కాపరులతో కలిసి ఆంధ్ర ప్రాంతంలో గొర్రెలను మేపుకొని మూడు డీసీఎం వాహనాల్లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి సమీపంలో వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల్లో తరలిస్తున్న 300కు పైగా గొర్రెలు మృతి చెందడంతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెల మృతదేహాలు స్థానికులను కలచివేశాయి.సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య, గొర్రెల పెంపకదారుల కార్పొరేషన్ చైర్మన్ సరిత, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుడు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేష్ బాధిత కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బాలునాయక్, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి గరిష్ట స్థాయిలో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గొర్రెలను కోల్పోయి తీవ్ర నష్టపోయిన యాదవ, కురుమ కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రమాదంలో ఓ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, వందలాది గొర్రెలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News