ఆదోని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరింత కార్యాచరణ చేపట్టాలని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందకపోవడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఆదోని పట్టణంలోని రెవిన్యూ భవన్లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఆందోళనలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి