PRINT TIME: July 12, 2026 04:39 AM
హత్యకు గురైన మధు మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ
హత్యకు గురైన మధు మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ
May 23, 2026 02:50 PM
403 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. హత్యకు గురైన మధు మృతదేహాన్ని శనివారం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి