Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:59 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
May 19, 2026 09:04 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు, పర్యాటక ఆస్తులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా పర్యాటక మండలి (District Tourism Council - DTC) సమావేశం అత్యంత కీలకమైన చర్చలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక కార్యకలాపాల ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా సమీక్షించారు.జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలలో సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా చారిత్రక ప్రాంతమైన లేపాక్షిలోని హరిత హోటల్‌కు తక్షణమే పెయింటింగ్ పనులు*చేపట్టి, సముచిత నిర్వహణతో పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి సౌకర్యాలను శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచాలని స్పష్టం చేశారు.జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో లేని పర్యాటక శాఖ ఆస్తులను తక్షణమే గుర్తించి, వాటిని లీజ్ విధానం ద్వారా వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల పర్యాటక శాఖకు ఆదాయ వనరులు పెరగడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.జిల్లా సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా పెనుకొండలో “నివేదిత టీమ్” సమన్వయంతో ప్రాంతీయ వంటకాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో కూడిన ఒక ఘనమైన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలనే ఆసక్తిని జిల్లా కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలు కేవలం జిల్లా వాసులకే కాకుండా, ఇతర రాష్ట్రాల పర్యాటకులను సైతం ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రైవేట్ పెట్టుబడిదారులు, పర్యాటక రంగ వ్యాపారవేత్తలు జిల్లాలో రిసార్టులు, ఈకో టూరిజం ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన తమ వినూత్న ఆలోచనలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనలను అభినందించిన జిల్లా కలెక్టర్, జిల్లాలో పర్యాటకుల రాకను పెంచే ఇలాంటి ప్రాజెక్టుల అమలుకు పర్యాటక శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం డిఆర్‌డిఎ పిడి నరసయ్య,జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News