సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్లపై ప్రత్యేక శిక్షణ
సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్లపై ప్రత్యేక శిక్షణ
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ అధికారి శ్రీ యస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో స్టేషన్ సిబ్బందికి డే డ్రోన్ మరియు నైట్ విజన్ డ్రోన్ ఆపరేటింగ్పై ప్రత్యేక హ్యాండ్స్-ఆన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణను జిల్లా హెడ్క్వార్టర్స్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు మరియు పోలీస్ సిబ్బంది అందించారు. కార్యక్రమంలో సోమందేపల్లి ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా డ్రోన్ల వినియోగంపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఆధునిక పోలీసింగ్లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనున్నదని వివరించారు. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ, భారీ జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల మానిటరింగ్, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాల గుర్తింపు, రాత్రివేళల్లో నైట్ విజన్ ద్వారా గస్తీ, తప్పిపోయిన వ్యక్తుల అన్వేషణ, రోడ్డు ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల పరిశీలన, సరిహద్దు మరియు నిర్మానుష ప్రాంతాల పర్యవేక్షణ, పాఠశాలలు మరియు ముఖ్య ప్రభుత్వ భవనాల భద్రత వంటి అంశాల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
డ్రోన్ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో విస్తృత ప్రాంతాలను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని, పోలీసింగ్ను మరింత ఆధునికంగా మరియు సమర్థవంతంగా మార్చడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, “భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్లో కీలక పాత్ర పోషించనుంది. ప్రజల భద్రత కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంలో మా సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు” అని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి