Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 12:47 AM

సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ

సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ

సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ
May 09, 2026 06:52 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ అధికారి శ్రీ యస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ సిబ్బందికి డే డ్రోన్ మరియు నైట్ విజన్ డ్రోన్ ఆపరేటింగ్‌పై ప్రత్యేక హ్యాండ్స్-ఆన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


ఈ శిక్షణను జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు మరియు పోలీస్ సిబ్బంది అందించారు. కార్యక్రమంలో సోమందేపల్లి ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


శిక్షణలో భాగంగా డ్రోన్ల వినియోగంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఆధునిక పోలీసింగ్‌లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనున్నదని వివరించారు. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ, భారీ జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల మానిటరింగ్, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాల గుర్తింపు, రాత్రివేళల్లో నైట్ విజన్ ద్వారా గస్తీ, తప్పిపోయిన వ్యక్తుల అన్వేషణ, రోడ్డు ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల పరిశీలన, సరిహద్దు మరియు నిర్మానుష ప్రాంతాల పర్యవేక్షణ, పాఠశాలలు మరియు ముఖ్య ప్రభుత్వ భవనాల భద్రత వంటి అంశాల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.


డ్రోన్ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో విస్తృత ప్రాంతాలను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని, పోలీసింగ్‌ను మరింత ఆధునికంగా మరియు సమర్థవంతంగా మార్చడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, “భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రజల భద్రత కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంలో మా సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు” అని పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News