నల్గొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీ విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్ సెంటర్ వద్ద ముగిసింది.
వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచ్లు, తైక్వాండో క్రీడాకారులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మార్గమంతా దేశభక్తి నినాదాలతో సందడి నెలకొంది.
తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ సెక్రటరీ ఎండీ యూనుస్ కమాల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. క్రీడల ద్వారా యువతలో ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
అనంతరం పాల్గొన్న వారంతా రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశ సేవకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి