చిట్యాల: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.కెనరా బ్యాంక్ మేనేజర్ ఎ. బిశ్వాస్ విద్యార్థినులు రుచిత, భవాని, తేజ, సహస్ర, హారిక, కామాక్షిలకు ఉపకార వేతనాలను అందజేశారు. గత సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకీర్తన, షాహిన్, పూజ, శివప్రసాద్, మల్లన్న, యాస్మిన్, శిరీష, భవాని, ధన్యకౌర్లను ఉపాధ్యాయులు అభినందించి నగదు బహుమతులు అందించారు.గణిత ఉపాధ్యాయులు ఇందిర, శైలజ, ఆంగ్ల ఉపాధ్యాయులు కవిత, మంజుల, హిందీ ఉపాధ్యాయులు ఎండీ. సాదిక్, బయాలజీ ఉపాధ్యాయురాలు సరళ తమ వంతుగా నగదు బహుమతులు అందించి విద్యార్థులను ప్రోత్సహించారు.అలాగే సీనియర్ ఉపాధ్యాయులు కోణం శ్రీనివాస్ తమ కోణం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు టీషర్టులు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఎ. పద్మజ, ఎన్. సైదులు, సీహెచ్. ప్రసన్న, ఎం. జానకి, ఎం. సౌమ్య, ప్రవీణ, కుసుమ, శ్రీనివాస్, తిరుమల, నవీన్, హైమవతి తదితరులు పాల్గొన్నారు. బహుమతులు, ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి