యాదాద్రి భువనగిరి జిల్లా,: మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గొప్ప పండుగ రోజని అన్నారు. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడం, ఎన్నో పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగేల్లి వలి, మార్కెట్ డైరెక్టర్ రాచమల్ల తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు రాచమల్ల విజయ్, ఉపాధ్యక్షులు జంపాల భార్గవ్, మాజీ అధ్యక్షులు నాగేల్లి పాండు, నాగేల్లి కృష్ణ, నాగేల్లి నాగేష్, రాచమల్ల ఉమాపతి, నాగేల్లి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కడారి దయాకర్, దడిపల్లి సతీష్, రాచమల్ల వినోద్, నాగేల్లి భాను, రాచమల్ల ప్రభాకర్, రాచమల్ల దినేష్, ప్రజ్ఞాపూర్ విగ్నేష్, కడారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి