జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని బాలాజీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కె.వి మృణాళిని ఆధ్వర్యంలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తో ముందుకు సాగాలని తెలియజేశారు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానీయులు చేసిన త్యాగాల పోరాటాలే నేటి త్యాగాని
స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యతోపాటు ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనపై ఉందని తెలియజేశారు. మహనీయుల త్యాగాల ప్రతిఫలంగా వచ్చిందే ఈ స్వతంత్ర దినోత్సవం అని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాలాజీ హై స్కూల్ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు భారీ ర్యాలీగా బయలుదేరి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకో నినాదాలతో బయలుదేరారు మల్కాజ్గిరి చౌరస్తాలో వివిధ నాట్య ప్రదర్శనలతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణనాలతో రంగురంగుల హరివిల్లు తో నాట్య ప్రదర్శనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ టి డి శ్రీనివాసన్,ప్రధాన ఉపాధ్యాయురాలు కె వి మృణాళిని, జనరల్ సెక్రటరీ టిడి స్వప్న, కరస్పాండెంట్ సందీప్, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి