యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 40వ జయంతి సందర్భంగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి (TPYS) యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా గిరిధరాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణ చేసిన మహోన్నత త్యాగమూర్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన త్యాగం మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి కోట్లాది మంది ఉద్యమకారుల్లో చైతన్యం నింపిందన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో TPYS జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్, కోఆర్డినేటర్ మహాకాళి సురేష్చారి, సోషల్ మీడియా ఇన్చార్జి సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్కుమార్, చోల్లేటి శ్రీనివాసచారి, అక్కెనపల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి