చిట్యాల: విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ఉరుమడ్ల MPPS పాఠశాలకు SSC 1987–88 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.20 వేల విలువైన మైక్సెట్తో పాటు నోట్బుక్స్ను బహూకరించారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు మోహన్రెడ్డి, సాగర్ల భిక్షం, బొప్పని యాదయ్య, సర్పంచ్ భానుశ్రీ భిక్షం, ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి