కర్రతో కొట్టి చంపిన నిందితుడు సయ్యద్ బషీర్
కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొండూరు గ్రామానికి చెందిన రాయి కొట్టే కూలీ ఎం.డి. సలీమా (38) జులై 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతమ్ పల్లికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. జులై 25న భువనగిరి బస్టాండ్లో సలీమాను తన పల్సర్ బైక్పై ఎక్కించుకుని వెంకటాపురం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు. అక్కడ శారీరకంగా కలిసిన అనంతరం సలీమా పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టడంతో సలీమా అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి