Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 06:40 AM

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య
16-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కర్రతో కొట్టి చంపిన నిందితుడు సయ్యద్ బషీర్

కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొండూరు గ్రామానికి చెందిన రాయి కొట్టే కూలీ ఎం.డి. సలీమా (38) జులై 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతమ్ పల్లికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. జులై 25న భువనగిరి బస్టాండ్‌లో సలీమాను తన పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని వెంకటాపురం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు. అక్కడ శారీరకంగా కలిసిన అనంతరం సలీమా పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టడంతో సలీమా అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Sthanikam

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

Article Image

కర్రతో కొట్టి చంపిన నిందితుడు సయ్యద్ బషీర్

కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొండూరు గ్రామానికి చెందిన రాయి కొట్టే కూలీ ఎం.డి. సలీమా (38) జులై 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతమ్ పల్లికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. జులై 25న భువనగిరి బస్టాండ్‌లో సలీమాను తన పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని వెంకటాపురం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు. అక్కడ శారీరకంగా కలిసిన అనంతరం సలీమా పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టడంతో సలీమా అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News