శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం తోటగేరి కాలనీకి చెందిన టిడిపి నాయకుడు గోపి కృష్ణ కుమార్తె రిథిక రాయ్ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పెనుకొండ ప్రగతి పాఠశాలలో చదివిన ఆమె 587 మార్కులు సాధించి ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించింది.
క్రమశిక్షణతో చదువుతూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన రిథిక ఈ విజయంతో పాఠశాలకే గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రతిభను అభినందిస్తూ తెదేపా అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పలువురు నాయకులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఆనంద సందర్భంగా గోపి కృష్ణ స్వీట్లు పంపిణీ చేసి తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు.
విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రిథిక మరోసారి నిరూపించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి