Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:54 PM

జలధార - జల హారతి పనులు వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్

జలధార - జల హారతి పనులు వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్

జలధార - జల హారతి పనులు వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్
May 19, 2026 08:28 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

స్టానిక కలెక్టరేట్ లోని వీడియో కన్ఫారెన్స్ హాల్ నందు మడకశిర క్లస్టర్ నందు అగలి,అమరాపురం,

గుడిబండ మరియు మడకశిర మండలాల సిబ్బంది అయినా ఇరిగేషన్ ఏఈ, లు mgnregs ఎపిడి లు ,ఎంపిడిఓ, ఏపిఓ లు,మరియు అందరూ ఇంజనీరింగ్ సహాయకుడు లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార-జలహారతి’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ మంగళవారం నాడు జిల్లా మరియు మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలాల ప్రగతి పై అధికారులకు దిశా నిర్దేశము చేశారు ప్రగతిలో వెనకంజలో ఉన్న మండలాల వారికి మందలించడం జరిగింది. జిల్లాలోని అన్ని చెరువులు, కాలువలను త్వరితగతిన బాగు చేయాలి. ప్రతి చెరువులోకి నీరు చేరేలా చెరువు పూడికతీత పనులు, ఫీడేర్ కాలువలు పునరుద్ధరణ పనులు ,మరియు చెక్ డ్యాం పూడికతీత పనులు కి పరిపాలన మంజూరు కాబడిన పనులు త్వరిత గతిన సకాలంలో పూర్తి చేయాలి,ఈ ప్రక్రియలో అధికారులు అందరూ ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు అందరినీ కలుపుకొని 'జలధార-జలహారతి' పనులు వేగవంతం చేయాలని అలాగే మొబైల్ యాప్‌ను వినియోగించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఎంపీడీఓలు , ఏపీఓలు పనిచేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలో పనులు జరిగేలా చూడాలని, పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన *నీడ, తాగునీరు మరియు మెడికల్ కిట్లను* తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.నిర్దేశించిన టార్గెట్ మేరకు ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో డిడబ్ల్యుఎంఏ పిడి విజయప్రసాద్ ప్రసాద్, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News