PRINT TIME: April 28, 2026 09:31 PM
రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం
రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం
April 28, 2026 07:39 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
రొద్దం గ్రామ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గ్రంథాలయ అధికారి హెచ్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు, పుస్తక పఠనం, డ్రాయింగ్, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అలాగే క్యారంస్, ఆటలు, డ్యాన్స్ పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా బయట తిరగకుండా శిబిరంలో పాల్గొనాలని సూచించారు.
ఈ శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు కొనసాగనుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి