నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జెల్ల పాండు, చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత, స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై వెంకట్రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు దేశ ప్రజలుస్వేచ్ఛావాయువులుపీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎన్నటికీ మర్చిపోవద్దని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి