PRINT TIME: June 28, 2026 12:48 AM
సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం
సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం
May 06, 2026 01:35 PM
79 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రొద్దం మండల వ్యవసాయ అధికారి జి. రాజేష్ తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు అవుతున్న SMAM పథకం ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ యంత్రాలు సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.
SC, ST, చిన్నకారు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, OBC మరియు జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు అందించబడతాయి. ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, విత్తనాల నాటే యంత్రాలు, చాప్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఈ పథకంలో లభ్యమవుతాయి.
రైతులు ఆన్లైన్ ద్వారా లేదా సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి