వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్కు తీవ్ర గాయాలు
వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్కు తీవ్ర గాయాలు
Komidala Mahender reddy
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో డీసీఎం
చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమేడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి