Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:52 AM

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన  సర్పంచ్ సునీత వీరస్వామి
03-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేములకొండ–లక్ష్మాపురం గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు ఫలించి రామన్నపేట–వేములకొండ మార్గంలో నూతన బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

రామన్నపేట బస్టాండ్‌లో ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బస్సును ప్రారంభించగా, లక్ష్మాపురం గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి కొబ్బరికాయ కొట్టి బస్సు సేవలను ప్రారంభించారు. గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేములకొండ, లక్ష్మాపురంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులు కొంత మేరకు తీరనున్నాయని పేర్కొన్నారు.

బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి

Article Image

వేములకొండ–లక్ష్మాపురం గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు ఫలించి రామన్నపేట–వేములకొండ మార్గంలో నూతన బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

రామన్నపేట బస్టాండ్‌లో ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బస్సును ప్రారంభించగా, లక్ష్మాపురం గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి కొబ్బరికాయ కొట్టి బస్సు సేవలను ప్రారంభించారు. గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేములకొండ, లక్ష్మాపురంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులు కొంత మేరకు తీరనున్నాయని పేర్కొన్నారు.

బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News