లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి
లక్ష్మాపురం గ్రామంలో కొత్త బస్సును ప్రారంభించిన సర్పంచ్ సునీత వీరస్వామి
Editor Desk
వేములకొండ–లక్ష్మాపురం గ్రామాల ప్రజల కు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులు ఫలించి రామన్నపేట–వేములకొండ మార్గంలో నూతన బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.
రామన్నపేట బస్టాండ్లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బస్సును ప్రారంభించగా, లక్ష్మాపురం గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి కొబ్బరికాయ కొట్టి బస్సు సేవలను ప్రారంభించారు. గ్రామస్తులు బస్సుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేములకొండ, లక్ష్మాపురంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు ఈ బస్సు సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా ఇబ్బందులు కొంత మేరకు తీరనున్నాయని పేర్కొన్నారు.
బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి