Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**
14-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ప్రతిపాదిత ఏకో టౌన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 15 గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గువ్వలేటి గ్రామ చౌరస్తా నుంచి సద్దుపల్లి చౌరస్తా వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు భారీ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

చిన్న రావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా "గో బ్యాక్ ఏకో టౌన్" గో బ్యాక్ ఏకో టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే మండల పరిధిలోని క్రషర్ యూనిట్లు, మూసీ నది కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ నంబర్-20 ద్వారా 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగర చెత్తను తరలించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఎకో టౌన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రతిపాదన వల్ల పరిసర గ్రామాల ప్రజల జీవన విధానం, వ్యవసాయం, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని, మన పిల్లల భవిష్యత్ మన భవిష్యత్ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునసమీక్షించాలని కోరారు.


జీఓ-20ను వెంటనే రద్దు చేయాలి


ప్రతిపాదిత ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించిన జీఓ-20ను తక్షణమే రద్దు చేసి, డంపింగ్ యార్డు ఏర్పాటుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Sthanikam

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**

Article Image

రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ప్రతిపాదిత ఏకో టౌన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 15 గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గువ్వలేటి గ్రామ చౌరస్తా నుంచి సద్దుపల్లి చౌరస్తా వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు భారీ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

చిన్న రావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా "గో బ్యాక్ ఏకో టౌన్" గో బ్యాక్ ఏకో టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే మండల పరిధిలోని క్రషర్ యూనిట్లు, మూసీ నది కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ నంబర్-20 ద్వారా 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగర చెత్తను తరలించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఎకో టౌన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రతిపాదన వల్ల పరిసర గ్రామాల ప్రజల జీవన విధానం, వ్యవసాయం, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని, మన పిల్లల భవిష్యత్ మన భవిష్యత్ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునసమీక్షించాలని కోరారు.


జీఓ-20ను వెంటనే రద్దు చేయాలి


ప్రతిపాదిత ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించిన జీఓ-20ను తక్షణమే రద్దు చేసి, డంపింగ్ యార్డు ఏర్పాటుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News