Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ
12-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనన్నారు.

ఇప్పటికే కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్‌ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

Article Image

నల్లగొండ

టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనన్నారు.

ఇప్పటికే కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్‌ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News