Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్తమ సేవలకు గుర్తింపు.. ముజమ్మిల్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 09:50 PM

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ
June 12, 2026 08:06 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనన్నారు.

ఇప్పటికే కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్‌ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News