టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్ఐ
టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్ఐ
Editor Desk
నల్లగొండ
టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్కు డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనన్నారు.
ఇప్పటికే కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వినతిపత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి