Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 08:59 AM

దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలి. ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపు

దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలి. ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపు

దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలి.  ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపు
June 12, 2026 06:22 AM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, : ఈనెల 13న నల్లగొండలో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపునిచ్చారు.

గురువారం పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో ఉన్న సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజుతో పాటు క్రైస్తవ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి వారిపై కొనసాగుతున్న వివక్షను తొలగించాలని, సమాజంలో సమాన హక్కులు కల్పించాలని ఆయన కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దళిత సంఘాలతో కలిసి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈనెల 13న జరిగే సదస్సుకు జిల్లాలోని క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు క్రిస్టఫర్, ఆర్సీఎం చర్చి ఫాదర్ జీవన్, బిషప్ సమర్పన్ కుమార్, హెబ్రోన్ సేవకులు జాకోబు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చిట్యాల పాల్‌రాజ్, హెడ్‌మాస్టర్ ప్రభుదాస్, డి. ప్రేమ్‌కుమార్, మేడి లక్ష్మయ్య, శౌరయ్య, యాచారం యాకోబ్, చింత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News