Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 08:01 AM

శ్రమశక్తి అవార్డుకు నాదెళ్ల బాలకృష్ణ అర్హులు

శ్రమశక్తి అవార్డుకు నాదెళ్ల బాలకృష్ణ అర్హులు

శ్రమశక్తి అవార్డుకు నాదెళ్ల బాలకృష్ణ అర్హులు
June 12, 2026 05:14 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉద్యోగాన్ని ఎవరైతే సేవగా భావించి ప్రజలకు సేవ చేస్తారో వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటది అనడానికి నిదర్శనం ఈ శ్రమశక్తి అవార్డు అని సూర్యాపేట జిల్లా ఎస్ఈ ఏ శ్రీనివాసులు , హుజుర్ నగర్ డివిజన్ డిఈ ఎన్ వెంకటకృష్ణయ్య లు అన్నారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ డివిజన్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో

శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ కి ఆత్మీయ అభినందన సభను గురువారం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని సన్మాన గ్రహీత నాదెళ్ల బాలకృష్ణను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ ఉద్యోగరీత్య పేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి సమస్యలను ఉద్యోగరీత్యా తీర్చుకుంటూ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో సత్యమేవ జయతే సేవాసమితిని ఏర్పాటుచేసి ఎంతోమందికి ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందంటే అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని చెప్పుకుంటూ ఎంతోమందికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికులు నాదెళ్ల బాలకృష్ణ కు ఈ అవార్డు రావడం హుజూర్ నగర్ డివిజనకే గర్వకారణమని అన్నారు. విద్యుత్ శాఖలో రైతులకు, పేద ప్రజల పక్షాన నిరంతరం శ్రమ చేస్తున్న నాదెళ్ల బాలకృష్ణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత శ్రమశక్తి అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందించదగిన విషయమని అన్నారు. ప్రతి విద్యుత్ కార్మికులు బాలకృష్ణ లాగా ప్రజలకు విద్యుత్ సమస్యను తొందరగా తీర్చి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ కార్య నిర్వాహక అధ్యక్షులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నేతగాని వెంకాన, జిల్లా కార్యదర్శి పి యాదగిరినాయుడు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల సత్యనారాయణ,ఇతర డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, ప్రముక వైద్యులు జాస్తి సుబ్బారావు, ఏ రామారావు, విద్యా వేత్తలు జానకిరామయ్య, హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుతుంబాక భాస్కర్, వీరేపల్లి మధుసూదనరావు, విద్యుత్ కార్మికులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News