Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మల్కాపూర్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ అనిల్ కుమార్ చర్యలు "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 11, 2026 06:42 PM

కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం

కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం

కోదాడ  ప్రాంత విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం
June 11, 2026 04:55 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K


కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ బాబు అన్నారు. కోదాడ పట్టణంలోని విద్యానగర్ లో ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ ఆర్ ఎస్ స్కూల్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి మెరుగైన విద్య అందించి వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దేలా ఎన్ ఆర్ ఎస్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక, మానవతా విలువలు బోధించి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీ పీ సీ సీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు లు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఎన్ ఆర్ ఎస్ కాలేజ్, ప్రాధమిక, హై స్కూల్ విద్యలో కూడా అవే ఫలితాలు సాధించాలన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులు అన్నిరంగాలలో రాణించేలా వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన చేసేందుకు సువిశాల క్యాంపస్ తో పాటు క్రీడలలో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, స్తానిక కౌన్సిలర్ తోట జ్యోతి, కాంగ్రెస్ నాయకులు తోట శ్రీను,కంభంపాటి శ్రీనివాస్, ఎన్ ఆర్ ఎస్ విద్యా సంస్థల చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పీ ఎన్ ఆర్, లెక్చరర్లు నటరాజ్, ఉపేందర్, రజనీ కుమార్, పీ ఆర్ వో మల్లికార్జున రావు, పలువురు టీచర్లు, విద్యార్థుల తల్లిదంద్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News