Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
11-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సిహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, పాఠశాలలలోనే పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించబడేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సతీష్, రాజ్‌కుమార్, అనూక్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

Article Image

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సిహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, పాఠశాలలలోనే పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించబడేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సతీష్, రాజ్‌కుమార్, అనూక్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News