Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల కష్టంలో వెంటనే స్పందించిన కౌన్సిలర్ షబానా అజీమ్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 11, 2026 08:22 PM

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
June 11, 2026 06:58 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల గ్రామానికి చెందిన కలాలి కృష్ణవేణికి రూ.40,000, తలారి ప్రవీణ్ కుమార్‌కు రూ.26,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జంగిర్, సంజీవ్ పటేల్, శంకరప్ప, నిరంజప్ప, విజయ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News