సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్.. డాక్టర్ మేరుగు రవి కుమార్కు డీజీపీ అభినందనలు
సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్.. డాక్టర్ మేరుగు రవి కుమార్కు డీజీపీ అభినందనలు
Editor Desk
హైదరాబాద్, : సైబర్ సెక్యూరిటీ రంగంలో విశిష్ట పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ మేరుగు రవి కుమార్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ వి.వి. శ్రీనివాస్, ఐపీఎస్ అభినందించారు.
“భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ పరిశోధన ఫలితాలపై విశ్లేషణ: రెండు దశాబ్దాల అధ్యయనం (2005–2024)” అనే అంశంపై డాక్టర్ ఉలగనాథన్ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేసిన రవి కుమార్, కోయంబత్తూరులోని భారతీయార్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన పరిశోధనలను సమగ్రంగా విశ్లేషిస్తూ, భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన పలు సూచనలను తన పరిశోధనలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ డీజీపీ వి.వి. శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ హెడ్గా పనిచేస్తున్న డాక్టర్ మేరుగు రవి కుమార్, తన పరిశోధనను తన గురువు వి.వి. శ్రీనివాస్కు అంకితం చేశారు. ఈ విజయానికి సహకరించిన తన జీవిత భాగస్వామి ప్రియాంక, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే వాసవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు పి. రామమోహన్ రావు, కార్యదర్శి పార్థసారథి, సీఈఓ పి. బాలాజీ, ప్రిన్సిపాల్ డా. ఎస్.వి. రమణ, కోశాధికారి ఆనంద్, జాయింట్ సెక్రటరీ పల్లవి తదితరులు డాక్టర్ మేరుగు రవి కుమార్ను అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి