Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 09:09 AM

సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్‌.. డాక్టర్ మేరుగు రవి కుమార్‌కు డీజీపీ అభినందనలు

సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్‌.. డాక్టర్ మేరుగు రవి కుమార్‌కు డీజీపీ అభినందనలు

సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్‌.. డాక్టర్ మేరుగు రవి కుమార్‌కు డీజీపీ అభినందనలు
June 12, 2026 05:25 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : సైబర్ సెక్యూరిటీ రంగంలో విశిష్ట పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన డాక్టర్ మేరుగు రవి కుమార్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ వి.వి. శ్రీనివాస్, ఐపీఎస్ అభినందించారు.


“భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ పరిశోధన ఫలితాలపై విశ్లేషణ: రెండు దశాబ్దాల అధ్యయనం (2005–2024)” అనే అంశంపై డాక్టర్ ఉలగనాథన్ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేసిన రవి కుమార్, కోయంబత్తూరులోని భారతీయార్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.


భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన పరిశోధనలను సమగ్రంగా విశ్లేషిస్తూ, భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన పలు సూచనలను తన పరిశోధనలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ డీజీపీ వి.వి. శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.


ప్రస్తుతం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ మేరుగు రవి కుమార్, తన పరిశోధనను తన గురువు వి.వి. శ్రీనివాస్‌కు అంకితం చేశారు. ఈ విజయానికి సహకరించిన తన జీవిత భాగస్వామి ప్రియాంక, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.


అలాగే వాసవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు పి. రామమోహన్ రావు, కార్యదర్శి పార్థసారథి, సీఈఓ పి. బాలాజీ, ప్రిన్సిపాల్ డా. ఎస్.వి. రమణ, కోశాధికారి ఆనంద్, జాయింట్ సెక్రటరీ పల్లవి తదితరులు డాక్టర్ మేరుగు రవి కుమార్‌ను అభినందించారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News