Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 08:03 AM

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ
June 12, 2026 05:34 AM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సామాజిక వనాల పెంపకం ప్రతి పౌరుడి బాధ్యత అని చౌటుప్పల్ రేంజ్ అటవీ శాఖ అధికారి జి. సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలోని నర్సరీ వద్ద పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "హరిత తెలంగాణ – స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు" అనే నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

అనుమతులు లేకుండా చెట్లను నరికితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల విస్తీర్ణం పెరగడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారులు డి. రాగ్యానాయక్, ఎం. గోవర్ధన్, రామన్నపేట గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్, ఉపసర్పంచ్ మోటే రమేష్, కొమ్ము శేఖర్, గొరిగి శేఖర్, మోటే మహేష్, సుదర్శన్, ఆంజాద్, బీటీ అధికారులు కళ్యాణి, ప్రశాంతి, రవి, స్వాతి రాజశేఖర్‌తో పాటు నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News