Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ
12-06-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సామాజిక వనాల పెంపకం ప్రతి పౌరుడి బాధ్యత అని చౌటుప్పల్ రేంజ్ అటవీ శాఖ అధికారి జి. సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలోని నర్సరీ వద్ద పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "హరిత తెలంగాణ – స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు" అనే నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

అనుమతులు లేకుండా చెట్లను నరికితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల విస్తీర్ణం పెరగడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారులు డి. రాగ్యానాయక్, ఎం. గోవర్ధన్, రామన్నపేట గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్, ఉపసర్పంచ్ మోటే రమేష్, కొమ్ము శేఖర్, గొరిగి శేఖర్, మోటే మహేష్, సుదర్శన్, ఆంజాద్, బీటీ అధికారులు కళ్యాణి, ప్రశాంతి, రవి, స్వాతి రాజశేఖర్‌తో పాటు నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.



Sthanikam

ఒక్కో వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షిస్తేనే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుంది" అని అటవీశాఖ అధికారి జి. సత్యనారాయణ

Article Image

రామన్నపేట, సామాజిక వనాల పెంపకం ప్రతి పౌరుడి బాధ్యత అని చౌటుప్పల్ రేంజ్ అటవీ శాఖ అధికారి జి. సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలోని నర్సరీ వద్ద పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "హరిత తెలంగాణ – స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు" అనే నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

అనుమతులు లేకుండా చెట్లను నరికితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల విస్తీర్ణం పెరగడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారులు డి. రాగ్యానాయక్, ఎం. గోవర్ధన్, రామన్నపేట గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్, ఉపసర్పంచ్ మోటే రమేష్, కొమ్ము శేఖర్, గొరిగి శేఖర్, మోటే మహేష్, సుదర్శన్, ఆంజాద్, బీటీ అధికారులు కళ్యాణి, ప్రశాంతి, రవి, స్వాతి రాజశేఖర్‌తో పాటు నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News