ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..
ఓటర్ జాబితా సర్వే పారదర్శకంగా జరగాలి... తాహసిల్దార్ సరిత..
Harish K
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి.. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్..
రాబోయే వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తాసిల్దార్ సరిత, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్ అన్నారు.మండల పరిధిలో విజయరాఘవపుం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుంకర పిచ్చయ్య అద్యక్షతన నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా రేపాల,నర్సింహులగూడెం, సీతానగరం,జగన్నాధపురం గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామ సభలు నిర్వహించగా అయా గ్రామల సర్పంచ్లుయం సత్యనారాయణ,కె ఇందిరా నర్సయ్య,బి వీరయ్య,బి యుమున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ నరేష్, వ్యవసాయ మండల విస్తరణ అధికారి బి రాజు,ఆర్ఐ రామారావు,మంజుల, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈ వికాస్,ఎపిఓ శైలజా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వినయ్ కుమార్, రామకృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు,ఆరోగ్యశాఖ అంగన్వాడి,పాలక వర్గం సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి