ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.
ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.
Editor Desk
నల్గొండ,: తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించగా, ఏడుగురు 467 మార్కులు పొందారు. మరో ముగ్గురు 465 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి 438 మార్కులు సాధించగా, మరో విద్యార్థి 437 మార్కులు, ఇద్దరు విద్యార్థులు 436 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జోనల్ ఇన్చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ ఇన్చార్జి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి తదితర అధ్యాపకులు అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి