ప్రజాపాలన_ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు స్థానిక ఎస్ఐ హాజరై మాట్లాడారు. మన సమాజం నుండి డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు, గంజాయి వియోగం వల్ల మన పిల్లలు, యువత అనారోగ్యాలకు గురైతున్నారు, దీని వల్ల బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యమై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అన్నారు. పోలీసు నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది, గంజాయి అలవాటు, రవాణా పై నిఘా ఉంచామని
అనంతరం స్థానిక ప్రజలతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి