నా తండ్రి నుండి సంక్రమించిన వారసత్వం వాటాను కాపాడండి
నా తండ్రి నుండి సంక్రమించిన వారసత్వం వాటాను కాపాడండి
Harish K
నా తండ్రి ముడుంబ వెంకట నరసింహాచార్యులు నుండి సంక్రమించిన శ్రీ దేవుల బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకత్వ వాటాను కాపాడా కాపాడాలని దేవాలయ శాఖ కమిషనర్ సహాయ కమిషనర్ ను ప్రస్తుత అర్చకులు రామ లక్ష్మణ చార్యులు కోరారు ఈ దేవాలయ అర్చకత్వం నా తండ్రి 2004 వరకు నిర్వర్తించుకుంటూ 2004లో మరణించారు ఈ మరణ అనంతరం దేవాలయ అర్చకత్వాన్ని చిన్నవాడనైనా నేను నిరుద్యోగి కావడంతో బాధ్యతలు నాకు అప్పగించినారు ఈ దేవాలయం క్రింద సుమారు 8 ఎకరాల భూమిని కౌలుకి ఇచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది నాన్నకు ముగ్గురు కొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అర్చకత్వ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు దేవాలయ అర్చకత్వాన్ని నిర్వర్తించుకుంటూ నా బాధ్యతలను నెరవేరుస్తూ దేవునికి సేవ చేసుకుంటున్నాను 2022 దేవాలయం కింద ఉన్న భూములకు కౌలు కొంత పెరగటంతో నా రెండో అన్నయ్య వరదస్వామి వరదాచార్యులు ఈ దేవాలయ భూముపై కన్ను వేసి నేను చేసుకుంటున్న భూమిని లాక్కునేందుకు ఇబ్బందులకు గురిచేస్తూ 2025 లో నేను చేసుకుంటున్న భూమిలో రెండున్నర ఎకరాల భూమిని లాక్కొని కౌలుకి ఇచ్చుకుంటూ అనుభవిస్తున్నాడు దీనిపై ప్రశ్నించగా నాపై చేయి చేసుకొని అనేక ఇబ్బందులు గురిచేస్తుండగా స్థానిక అనంతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే హైదరాబాద్ దేవాలయ శాఖ కమిషనర్ నల్లగొండ దేవాలయ సహాయ కమిషనర్ కు విన్నవించుకున్నారు ఇప్పటికీ భూమిని తానే కౌలుకిస్తూ నాకు అన్యాయం చేస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో స్పందించి తగు న్యాయం చేయాలని కోరుచున్నాను.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి