పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
Biksham
మూడు వార్డుల నీటి సమస్యలకు పరిష్కారంగా బోర్ల ప్రారంభం
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉమ్మడి పిల్లలమర్రి 10, 11, 12వ వార్డుల ప్రధాన కూడలిలో మూసి కాలువపై నిర్మించనున్న నూతన వంతెనకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జననాయకుడు, సూర్యాపేట కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు టైగర్ శ్రీరాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు.
అదేవిధంగా మూడు వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు బోర్లు వేయించి, మోటారు స్విచ్ ఆన్ చేసి నీటి పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాధి,12 వార్డు కౌన్సిలర్లు కోడి నాగరాజు, 10 వ వార్డు కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, 11వ వార్డు ఇన్చార్జ్ శ్రీమతి ఎడ్ల గంగాభవాని, దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి