Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:59 PM

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి
12-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవగా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) కే.ఏ.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి వారికి అవార్డులు అందజేశారు. వైష్ణవి, సహస్ర, నందిని, శ్రీరామ్, సాయి తేజ, జగదీష్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం అలవర్చుకొని చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనురాధ, హెచ్‌ఎం మన్మద్ కిషోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, ఫారెస్ట్ బీట్ అధికారులు కృష్ణగౌడ్, సంజీవ్, వనజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవగా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) కే.ఏ.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి వారికి అవార్డులు అందజేశారు. వైష్ణవి, సహస్ర, నందిని, శ్రీరామ్, సాయి తేజ, జగదీష్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం అలవర్చుకొని చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనురాధ, హెచ్‌ఎం మన్మద్ కిషోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, ఫారెస్ట్ బీట్ అధికారులు కృష్ణగౌడ్, సంజీవ్, వనజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News