పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్వో ప్రసాద్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్వో ప్రసాద్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవగా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో) కే.ఏ.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి వారికి అవార్డులు అందజేశారు. వైష్ణవి, సహస్ర, నందిని, శ్రీరామ్, సాయి తేజ, జగదీష్లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం అలవర్చుకొని చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనురాధ, హెచ్ఎం మన్మద్ కిషోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, ఫారెస్ట్ బీట్ అధికారులు కృష్ణగౌడ్, సంజీవ్, వనజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి