సుమన్రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చెరుపల్లి సీతారాములు
సుమన్రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చెరుపల్లి సీతారాములు
K.RAVI
సిపిఎం సీనియర్ నాయకుడు, చౌటుప్పల్ మాజీ సర్పంచ్ చింతల సుమన్రెడ్డి అకాల మరణం సిపిఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సుమన్రెడ్డి పార్థివదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం సుమన్రెడ్డి నిరంతరం పోరాడారని, చౌటుప్పల్లో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ అంతిమయాత్రలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, సిపిఎం పార్టీ చౌటుప్పల మున్సిపల్ కార్యదర్శి, గోశిక కరుణాకర్, నాయకులు మేక అశోక్ రెడ్డి, యాదిరెడ్డి, చింతల దామోదర్ రెడ్డి, అవ్వారి రామేశ్వరి, బత్తుల శ్రీశైలం, దండా అరుణ్ కుమార్, బత్తుల దాసు, గోపగోని లక్ష్మణ్, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, ఉష్కాగుల రమేష్, గుజ్జుల సురేందర్ రెడ్డి, వీసం విజయ రెడ్డి, చింతల మధుసూదన్ రెడ్డి, కలకుంట్ల శివ, కామిశెట్టి ప్రభాకర్, పల్చం రాములు, వీసం చంద్రారెడ్డి పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి