PRINT TIME: June 12, 2026 09:43 PM
ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్
ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్
June 12, 2026 07:47 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, అభివృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందుతూ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, సుమలత, రాంబాబు, సహజు, మైధిలి, మహిబూబ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి