నూతన డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం
నూతన డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం
Prabhakar
టీజీఎస్ఆర్టీసీ కూకట్పల్లి రీజినల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ధర్మను శుక్రవారం పలువురు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
రాణిగంజ్ బస్ డిపోకు చెందిన ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రషీద్, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్. శ్రీను, కిషన్ తదితరులు ఆమెను కలిసి శాలువా కప్పి, పూలదండతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్ష్మీ ధర్మ నాయకత్వంలో కూకట్పల్లి రీజియన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అనంతరం లక్ష్మీ ధర్మ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విధులు నిర్వహిస్తానని, ప్రయాణికుల సౌకర్యాలు మరియు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంఘాల ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి