Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్
26-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

​* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"

మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

Article Image

* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

​* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"

మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News