యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్
K.RAVI
* బీపీఈడీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
* విద్యార్థులతో ప్రతిజ్ఞ.. ఉత్సాహంగా సాగిన "రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ"
మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేస్తుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నారు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవగాహన రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి