మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం
మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం
K.RAVI
* సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతుల గృహప్రవేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించిన 'ఇంద్రమ్మ ఇల్లు' గురువారం ఘనంగా ప్రారంభమైంది. వార్డుకు చెందిన లబ్ధిదారులు సరిపల్లి సౌజన్య-నరసింహ దంపతులు తమ నూతన గృహాన్ని పూర్తి చేసుకుని, గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు.
వారి ఆహ్వానం మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విచ్చేసి నూతన ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్త వరకాల రవి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, సరిపల్లి మారయ్య, జంపాల కృష్ణ, మట్టపల్లి యాదగిరి, మారుపాక ప్రభాకర్, అయిలయ్య యాదవ్, వార్డు అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి