Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:45 AM

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి. భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి. భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి.  భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ
25-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని ఆయన అభిమాని నకిరేకంటి నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు గత ప్రభుత్వాలు భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని కేటాయించాయని తెలిపారు. ప్రస్తుతం ఆ భద్రతను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే భద్రత తగ్గించే చర్యలు చేపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆయన భద్రత విషయంలో ప్రభుత్వం పునరాలోచించి, గతంలో ఉన్న ఏర్పాట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.


ఆయన ప్రాణాలకు ఏవైనా ముప్పు వాటిల్లితే సంబంధిత ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి. భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ

Article Image

నల్లగొండ,: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని ఆయన అభిమాని నకిరేకంటి నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు గత ప్రభుత్వాలు భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని కేటాయించాయని తెలిపారు. ప్రస్తుతం ఆ భద్రతను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే భద్రత తగ్గించే చర్యలు చేపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆయన భద్రత విషయంలో ప్రభుత్వం పునరాలోచించి, గతంలో ఉన్న ఏర్పాట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.


ఆయన ప్రాణాలకు ఏవైనా ముప్పు వాటిల్లితే సంబంధిత ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News