Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 08:05 PM

ఆర్టీసీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు. కర్నూలు–ఆదోని మార్గంలో అదనపు సర్వీసులు కోరిన నాయకులు

ఆర్టీసీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు. కర్నూలు–ఆదోని మార్గంలో అదనపు సర్వీసులు కోరిన నాయకులు

ఆర్టీసీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు.  కర్నూలు–ఆదోని మార్గంలో అదనపు సర్వీసులు కోరిన నాయకులు
June 25, 2026 06:57 PM 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ఆదోని ప్రాంతానికి తగినన్ని బస్సులు నడపకపోవడం దురదృష్టకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం ప్రాంతాలకు చాలా తక్కువ బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.


కర్నూలు నుంచి ఇతర జిల్లాల ప్రాంతాలకు తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, సొంత జిల్లాలోని ఆదోని ప్రాంతానికి సరిపడా సర్వీసులు లేకపోవడం వివక్షపూరిత ధోరణిగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు.


అలాగే కర్నూలు బస్సు స్టాండ్ ఇరుకుగా మారిందని, రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు స్టాండ్‌ను విస్తరించడమో, లేక ఆదోని రోడ్డువైపు తరలించడమో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News