Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:19 PM

డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ

డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ

డ్రగ్స్‌కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ
June 25, 2026 05:55 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు భారీ యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజంలో అవగాహన పెంచాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "డ్రగ్స్‌కు నో... జీవితానికి యెస్" అనే నినాదంతో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయగా, మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News