డ్రగ్స్కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ
డ్రగ్స్కు నో.. జీవితానికి యెస్ అంటూ యువత ప్రతిజ్ఞ
Krishna
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు భారీ యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొని మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజంలో అవగాహన పెంచాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "డ్రగ్స్కు నో... జీవితానికి యెస్" అనే నినాదంతో విద్యార్థులు ప్రతిజ్ఞ చేయగా, మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి