Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:31 AM

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు
25-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మెడికల్ కాలేజీలో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యసన సమస్యలతో బాధపడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 14446 డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, విద్యాశాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

Article Image

సంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మెడికల్ కాలేజీలో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యసన సమస్యలతో బాధపడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 14446 డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, విద్యాశాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News