Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:13 PM

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు

మాదకద్రవ్యాల నిర్మూలనకు యువతే మార్గదర్శకులు
June 25, 2026 05:55 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మెడికల్ కాలేజీలో నిర్వహించిన “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ సప్తాహ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యసన సమస్యలతో బాధపడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 14446 డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, విద్యాశాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News