Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
25-06-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగుచూశాయని నాయకులు తెలిపారు.

పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు అందలేదని, ఉదయం అందించాల్సిన జావా కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, శశికుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగుచూశాయని నాయకులు తెలిపారు.

పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు అందలేదని, ఉదయం అందించాల్సిన జావా కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, శశికుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News