ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్ఎఫ్ఐ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్ఎఫ్ఐ
Komidala Mahender reddy
చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగుచూశాయని నాయకులు తెలిపారు.
పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు అందలేదని, ఉదయం అందించాల్సిన జావా కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, శశికుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి