Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిమ్మాపూర్‌లో ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసిన:సబ్ కలెక్టర్ ఉమాహారతి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 05:52 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
June 25, 2026 03:56 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగుచూశాయని నాయకులు తెలిపారు.

పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు అందలేదని, ఉదయం అందించాల్సిన జావా కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, శశికుమార్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News