విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ..
విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ..
NM Yadav
ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన పురస్కరించుకుని ఆర్కేఎస్ ఫౌండేషన్ ఉదారత..
హాజరైన బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, శానంపూడి సైదిరెడ్డి..
నల్లగొండ : భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా.. నల్లగొండ పట్టణంలో ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం డీవీకే రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పోటీదారులు పిల్లి రామరాజు యాదవ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దాదాపు 400 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు.
బొకేలు వద్దు, నోట్బుక్స్ ముద్దు రామరాజు వినూత్న పిలుపు..
ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ ఒక వినూత్న పిలుపునిచ్చారు. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే నాయకులు, అభిమానులు శాలువాలు, బొకేలు తేవడానికి బదులు.. పేద విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సామగ్రిని తీసుకురావాలని కోరారు. ఈ పిలుపునకు స్పందించిన కార్యకర్తలు, మిత్రుల నుంచి సుమారు 2,000 నోట్బుక్స్, 4,000 పెన్నులు, 100 ఎగ్జామ్ ప్యాడ్లు వచ్చాయి. వాటిని నేడు ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం సైదిరెడ్డి..
ఆర్కేఎస్ ఫౌండేషన్ నిరంతరం పేదలకు, విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో యువతకు, విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పించారని సైదిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విపస్య విద్యా సంస్థల చైర్మన్ బండారు ప్రసాద్, ఆర్కేఎస్ కమిటీ సభ్యుడు, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణం రాజు యాదవ్, పిల్లి శివరాజు, 25వ డివిజన్ కార్పొరేటర్ నవ్యశ్రీ రాఖీ, 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు యూసుఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పోతెపాక సాంబయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరు వెంకట్ రెడ్డి, యాణాల కరుణాకర్ రెడ్డి, కందుల శ్రీను, పర్వతం శరత్, లగడపురం వెంకన్న, ఫౌండేషన్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, జాన్ రెడ్డి, ఉపేందర్, పిల్లి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి